Thursday, October 22, 2015

గర్తపురి-5
================

గర్తపురి-5
================

వాగ్ధాటికి వేదికగాచిరస్థాయిగా నిలిచింది  వావిలాలపేరు
సామాన్యునికి అతిదగ్గరగా మసలడమే సాధారణంగా తన తీరు
ప్రజాప్రతినిధిగా అందరి  అభిమానం  పొందడమే ఆయన   సిరులు
ఓ విజ్ఞాన సర్వస్వంగా నిరంతరం అలరారు ఆయన కీర్తి చంద్రికల  ప్రభలు..

Monday, October 19, 2015

గర్తపురి-4
================

విద్యలకు రాజధానిగా
మా గర్తపురే దేశంతటా
విస్తరించిపోయి వెలుగులీనుతూ వుందెది.


ధనాధన్ మంటూ రవి కళాశాల
ఆదర్శంగా విదేశాల్లో సైతం
ఘనకీర్తితో వెలుగొండేది.


ఎందరో ఇంజనీర్లుగ, డాక్టర్లుగా
కావాలనుకునే విద్యార్ధులను
పోటీ పరీక్షల్లో ప్రధమగణ్యంగా
నిలబెడుతూ ఖ్యాతిగడించేది.
ఆతర్వాత తామరతంపరగా టూషన్ హోంలు
వెలసినా ఆకళాశాలముందు వెలవెలబోతూ వుండేవి.
క్రమశిఖణకు మారుపేరుగా కీర్తిని గడించింది.


ఎన్ని గన్లనైనా ఎదురొడ్డి తనస్థానం
 తానే సాలుసాలుకీనిలుపుకుని వుండేది.
====================================
గర్తపురి-3
==============


పండు  మిరపకూ,ఎండు మిరపకాయలకూ
మా వూరే ప్రాతినిధ్యం వహించేది.
మిర్చియార్డుకూడా మావూళ్ళోనే
వ్యాపార పరంగా  స్థిరంగా నిలిచి  వుండేది.
కాయతుదార్లు వూళ్ళో తిరిగి మిర్చీని
కొనడం బాగా జరుగుతుండేది.
బోరేల్లో మిరపకాయలు తొక్కుతూండడం
సరదాగా సాగుతుండేది.
ఆడ కూలీలకు కూడా  చేతినిండా పనిదొరికి
ఐదువేళ్ళూ లోపలికి పోవడానికి
త వంతుగా సాయడుతుండేది.
గోంగూరా, పండుమిరప  పళ్ళ పచ్చడి
ప్యారీ వారి జాడీల్లో చేతికందుబాటులో వుండేది.
అవసరమొచ్చినప్పుడల్లా రోట్లో నూరబడి
తిరగ మోత  [తాలింపుల] తో   ఘుమాయిస్తూ వుండేది.
****************************




.

మాగర్తపురికి[గుంటూరు] ఐదు  ఋతువులతో అనుబంధం చాలా తక్కువ
ఎక్కువగా గ్రీష్మాన్నే కౌగిలించుకుని కూర్చుంటుంది.
శ్రమచేయకుండానే చెమటలు పట్టించగల సామర్ధ్యం తనది.
ఇప్పుడు కొత్తరాజధానికో కొసలో ఉన్నట్లు కనిపించినా
గ్రీష్మానికి మా ఊరే తలమానికమై వెలుగొందుతుంది.

కాంక్రీటులమహారణ్యంలోనయినా  పచ్చని బయలు కనపడాలనే మాతపన.
సింగడు అద్దంకి పోయిమళ్ళీ వేగంగా  తిరిగి  వచ్చినా
 మా ఎండలు మాత్రం మమ్మల్నే నమ్ముకుని
ముమ్మూర్తులా రాజ్యాధికారం చేయడం ఖాయమనే  నాకుతోస్తుంది.

=========================================================
గర్తపురి-2
----------------

పొగత్రాగడం నేరంకానిరోజుల్లో
పొగాకు పంటా, పచ్చి పుగాకును కాల్చే బేరన్లూ
మాగుంటూర్లో దండిగా తలెత్తుకుని నిలిచాయి.
చాలామందినికోటీశ్వరులను చేసి
శ్రీమంతుల జాబితాలోకి వరుసగా చేర్చి మురిసాయి.
దొర,  నాటు పొగాకునూ రెండింటినీ పొలాలు పండించేవి.
పొగాకులో కలుపును 'మల్లె ' యంటూ పిలవడం జరుగుతుండేది.
కాలుస్తున్న పొగాకు ఘాటు మాత్రం ముక్కుల్లోకి దూరి
నసపెట్టించడం తుమ్ములు తెప్పించడం మొదలెడుతుండేది
.